Date : డిసెంబర్ 6, 2024
బెంగళూరు, డిసెంబరు 2: పరిశోధన, ఆవిష్కరణల్లో విశేషంగా కృషిచేసిన ఆరుగురు శాస్త్రవేత్తలకు 2020 ఇన్ఫోసిస్ అవార్డులను ప్రదానం చేశారు. హైదరాబాద్లోని సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయోలజీ (సీసీఎంబీ) శాస్త్రవేత్త రాజన్ శంకరనారాయణన్కు లైఫ్ సైన్సెస్ విభాగంలో ఈ పురస్కారాన్ని అందజేశారు.
అలాగే మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ) ప్రొఫెసర్ హరి బాలకృష్ణన్కు, కోల్కతాలోని సెంటర్ ఫర్ స్టడీస్ ఇన్ సోషల్ సైన్సెస్ పరిశోధకురాలు ప్రాచీ దేశ్పాండేకు, అమెరికాలోని స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ సౌరవ్ చటర్జీకి ఈ పురస్కారాలను అందజేశారు. బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ప్రొఫెసర్ అరిందమ్ ఘోష్కు, అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ రాజ్ చెట్టికి కూడా అవార్డులు లభించాయి.
This will close in 0 seconds